nirbhaya accused death warrant updates in telugu

నిర్భయను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితులు అక్షయ్ ఠాకూర్ సింగ్ (31), ముకేశ్(32), పవన్ గుప్తా(25) మరియు వినయ్ శర్మ(26) లను 22/01/2020 వ తేదీ ఉదయం ఏడు గంటలకు ఉరి తీయాలని కోర్టు 7/1/2020 న తెలిపింది.నిర్భయ నిందితులకు ఇంక పదిహేను రోజులలో ఉరితీయనుండడంతో నిర్భయ తల్లిదండ్రులు తమ కూతురుకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.


                 దేశప్రజలందరూ నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడటంతో దేశంలో న్యాయవ్యవస్థపై
ప్రజలకు నమ్మకం కలుగుతుందని భావిస్తున్నారు. అయితే మరికొంత మంది నిందితులు తప్పు చేశారని తెలిస్తే వెంటనే శిక్షలు పడాలని కోరుతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో దిశా నిందితుల విషయంలో తక్షణ న్యాయం జరగడంతో ఇలా అన్యాయానికి గురి అయిన  ప్రతి దిశా, నిర్భయలకు తక్షణ న్యాయం జరగాలని దేశమంతా కోరుకుంటోంది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, మహిళలకు , ఆడపిల్లకు రక్షణ కల్పించాలి. 

Comments